Friday, June 2, 2023
Homeపరిపాలనసామాన్యులపై భారాలు -సంపన్నులకు రాయితీలా?

సామాన్యులపై భారాలు -సంపన్నులకు రాయితీలా?

పెంచిన ఔషధాలు, టోల్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలి
 -సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం,మార్చి31(జనవిజయం): ఔషధాల (మందుల) ధరలు 12 శాతం, టోల్ గేట్ల వద్ద వసూలు చేసే చార్జీలు 5.5% పెంచటాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసరించుకోవాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే వైద్యం పచ్చి వ్యాపారంగా మారి పేదలకు భారమై పోతుంటే, 12% మందులు ధరలు పెంచి పేదల జీవితాలతో చెలగాట మాడటం దారుణ మన్నారు. కరోనా నేపథ్యంలో ఔషధ కంపెనీలు చేసిన దోపిడీ చరిత్రలో కనీవినీ ఎరగని దని అన్నారు. జాతీయ రహదారుల పేరుతో సామాన్యుల, మధ్యతరగతి ప్రజలను దోచు కుంటున్న ప్రభుత్వం 5.5% పెంచి మరింత భారం వేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. సామాన్యులపై భారాలు మోపి, సంపన్నులకు రాయితీ లు యిచ్చి,సంపద దోసి పెట్టే చర్యలు బిజెపి ప్రభుత్వం మానుకోవాలని, పెంచిన భారాలను, చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని నున్నా డిమాండ్ చేశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments